ఏపీలో ఇవాళ ఒక్కరోజే  103 కరోనా మరణాలు

ఏపీలో ఇవాళ ఒక్కరోజే  103 కరోనా మరణాలు
  • చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 15 మంది చొప్పున మృతి
  • ఇవాళ 14 వేల 429 కొత్త కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా మరణాల ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు సగటున వందకు పైగా మరణాలు సంభవిస్తున్న రాష్ట్రంలో ఇవాళ కూడా 103 మరణాలు నమోదయ్యాయి. రెండు వారాలుగా  చిత్తూరు జిల్లాలో సగటున 15 కరోనా మరణాలు నమోదవుతుండగా.. యాదృచ్చికమో కాకతాళీయమో గాని ఇవాళ కూడా 15 మరణాలు నమోదై రాష్ట్రంలో కరోనా మరణాల్లో చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. అలాగే చిత్తూరుతోపాలు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా 15 కరోనా మరణాలు నమోదయ్యాయి. విశాఖపట్టణం జిల్లాలో 10 మంది, నెల్లూరు జిల్లాలో 9 మంది, అనతపురం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో 8 మంది చొప్పున, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు, కడప, కర్నూలు జిల్లాల్లో నలుగురు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనా నుంచి కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. 
మరో వైపు గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14 వేల 429 కొత్త కేసులు నమోదయ్యాయి. 13 రాష్ట్రాల పరిధిలో 84 వేల 502 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 14 వేల 429 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 20 వేల 746 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక జిల్లాల వారీగా నమోదైన కరోనా కొత్త కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.